Commonwealth Games: పాక్పై సింధు విజయం.. హాకీలో ఘనాపై టీమిండియా ఘన విజయం
ABN , First Publish Date - 2022-07-30T02:37:42+05:30 IST
కామన్వెల్త్ గేమ్స్లో తొలి రోజు భారత క్రీడాకారుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికే బాక్సింగ్, స్విమ్మింగ్లో
బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో తొలి రోజు భారత క్రీడాకారుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికే బాక్సింగ్, స్విమ్మింగ్లో విజయాలు సాధించిన భారత్.. మరికొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిక్స్డ్ టీం గ్రూప్-ఎ బ్యాడ్మింటన్ మ్యాచ్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో పీవీ సింధు 3-0తో విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్, మిక్స్డ్ డబుల్స్ జట్టు తమ మ్యాచ్లను గెలిచి ఇండియాను 2-0 ఆధిక్యంలో తీసుకెళ్లారు.
ఘనాతో జరిగిన హాకీ మ్యాచ్లో భారత మహిళల జట్టు సంపూర్ణ ఆధిపత్యం సాధించి 5-0తో విజయం సాధించింది. అలాగే, 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ స్విమ్మింగ్లో శ్రీహరి నటరాజ్ సెమీస్కు అర్హత సాధించాడు. ఇండియన్ బాక్సర్ శివ థాపా 63 కేజీల విభాగంలో పాకిస్థాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్ను 5-0తో విజయం సాధించారు. మహిళల టీటీ జట్టు దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది.