ap news: ఎన్టీఆర్‌ని తీవ్రంగా అవమానిస్తున్న జగన్: పురందరేశ్వరి

ABN , First Publish Date - 2022-09-24T00:43:52+05:30 IST

ఎన్టీఆర్‌ని గౌరవిస్తున్నామని అసెంబ్లీలో చెబుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(cm jagan reddy) బయట తీవ్రంగా అవమానిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి(purandareshwari) అన్నారు.

ap news: ఎన్టీఆర్‌ని తీవ్రంగా అవమానిస్తున్న జగన్: పురందరేశ్వరి

విజయనగరం: ఎన్టీఆర్‌ని గౌరవిస్తున్నామని అసెంబ్లీలో చెబుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(cm jagan reddy) బయట తీవ్రంగా అవమానిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి(purandareshwari) అన్నారు. శుక్రవారం పూసపాటిరేగ మండలం రెల్లివలసలో బీజేపీ ప్రజా పోరు యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో పురందరేశ్వరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ డాక్టర్ కాదు కాబట్టే వారి పేరు తొలగిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి విచక్షణతో ఆలోచించాలన్నారు.డాక్టర్ ఎన్టీఆర్ సామాజిక డాక్టర్ అనే విషయాన్ని మరచిపోకూడదన్నారు.వైసీపీ నేతల స్వలాభం దెబ్బకు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా వలస పోవటానికి సిద్ధమయ్యాయని మండిపడ్డారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో పేదలకు కేంద్రం ఇళ్లు మంజూరు చేస్తే, జగనన్న కాలనీగా ఈ ముఖ్యమంత్రి పేరు మార్చుకుంటున్నారని పురందరేశ్వరి మండిపడ్డారు.

Updated Date - 2022-09-24T00:43:52+05:30 IST