పంజాబ్‌ను 151 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్

ABN , First Publish Date - 2022-04-17T23:04:14+05:30 IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ 151 పరుగులకే కుప్పకూలింది.

పంజాబ్‌ను 151 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్

ముంబై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్  కింగ్స్‌ 151 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లు విజృంభించి వికెట్లు తీడయంతో పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. ఉమ్రాన్ మాలిక్ వేసిన చివరి ఓవర్‌లో నలుగురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యారు.


లియామ్ లివింగ్‌స్టోన్ ఒక్కడే బౌలర్లను కాసేపు అడ్డుకోగలిగాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేయడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. షారూఖ్ ఖాన్ 26 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ 8, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 14, జానీ బెయిర్‌స్టో 12, జితేశ్ శర్మ 11, ఒడియన్ స్మిత్ 13 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, ఉమ్రాన్ మాలిక్ నాలుగు వికెట్లు పడగొట్టారు. 

Updated Date - 2022-04-17T23:04:14+05:30 IST