IPL 2022: ముగిసిన ఢిల్లీ బ్యాటింగ్.. పంజాబ్ ఎదుట ఓ మోస్తరు లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-17T02:54:05+05:30 IST
పంజాబ్ సూపర్ కింగ్స్తో ఇక్కడి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ సూపర్ కింగ్స్
ముంబై: పంజాబ్ సూపర్ కింగ్స్తో ఇక్కడి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది. మిచెల్ మార్ష్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. సర్ఫరాజ్ ఖాన్ 32 (16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్), లలిత్ యాదవ్ 24, అక్షర్ పటేల్ 17(నాటౌట్) పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్షదీప్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.