ప్రజల ఆరోగ్యాలు ప్రభుత్వానికి పట్టడం లేదు: అయ్యన్న

ABN , First Publish Date - 2020-10-01T22:06:52+05:30 IST

వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. అన్ని విభాగాల్లో దోపిడీ జరుగుతోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగని దోపిడీ..

ప్రజల ఆరోగ్యాలు ప్రభుత్వానికి పట్టడం లేదు: అయ్యన్న

విశాఖ: వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. అన్ని విభాగాల్లో దోపిడీ జరుగుతోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగని దోపిడీ.. ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా ఇసుకను దోచుకుంటున్నారని విమర్శించారు. ఇదంతా సీఎం జగన్‌కు తెలిసే జరుగుతుందా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. విశాఖలో నెలకు పది వేల టన్నులు దోపిడీ చేస్తున్నారని తెలిపారు. మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు నాటుసారా వైపు వెళ్తున్నారని, ప్రజల ఆరోగ్యాలు ప్రభుత్వానికి పట్టడం లేదని అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు.

Updated Date - 2020-10-01T22:06:52+05:30 IST