నా కొడుకు అభిషేక్ పై దుష్ప్రచారం చేయొద్దు: ఉప్పల శారద

ABN , First Publish Date - 2022-04-04T02:20:19+05:30 IST

సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఫుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు కేసు బుక్ చేశారు. దీనిపై పబ్ యజమాని అభిషేక్ తల్లి ఉప్పల శారద స్పందించారు.

నా కొడుకు అభిషేక్ పై దుష్ప్రచారం చేయొద్దు: ఉప్పల శారద

హైదరాబాద్: సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఫుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు కేసు బుక్ చేశారు. దీనిపై పబ్ యజమాని అభిషేక్ తల్లి ఉప్పల శారద స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నా కొడుకు అభిషేక్‌పై దుష్ప్రచారం చేయొద్దని కోరారు. నా కొడుకు నిరపరాధి అని అన్నారు. శనివారం రాత్రి పబ్‌లో పార్టీ జరిగింది. 148 మందిలో డ్రగ్స్‌ ఎవరు తెచ్చారో కనిపెట్టకుండా నా కొడుకు అభిషేక్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. నా కొడుకుపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ కేసుతో నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని ఆమె వెల్లడించారు. ఎవరో తెచ్చుకున్న డ్రగ్స్‌కు నా కొడుకును బలిచేయొద్దని ఆమె పోలీసులను వేడుకున్నారు. పోలీసులు ముందు డ్రగ్స్ తెచ్చినవారిని అరెస్ట్‌ చేయాలని అభిషేక్ తల్లి శారద డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-04T02:20:19+05:30 IST