పీఎస్‌‌‌యూలపై అనిల్‌ అగర్వాల్‌ కన్ను

ABN , First Publish Date - 2022-01-24T06:59:31+05:30 IST

పెద్ద ఎత్తున పీఎ్‌సయూలు కొనుగోలు చేసేందుకు అనిల్‌ అగర్వాల్‌ నాయకత్వంలోని వేదాంత రిసోర్సెస్‌ సిద్ధమవుతోంది. ఇందుకోసం 1,000 కోట్ల డాలర్లతో (రూ.74 వేల కోట్లు) ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని అగర్వాల్‌ చెప్పారు. ..

పీఎస్‌‌‌యూలపై అనిల్‌ అగర్వాల్‌ కన్ను

న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున పీఎ్‌సయూలు కొనుగోలు చేసేందుకు అనిల్‌ అగర్వాల్‌ నాయకత్వంలోని వేదాంత రిసోర్సెస్‌ సిద్ధమవుతోంది. ఇందుకోసం 1,000 కోట్ల డాలర్లతో (రూ.74 వేల కోట్లు) ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని అగర్వాల్‌ చెప్పారు. బీపీసీఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ) వంటి పీఎ్‌సయూల కొనుగోలు కోసం వేదాంత గ్రూపు ఆసక్తి చూపిస్తోంది. ఇందుకోసం బిడ్స్‌ కూడా సమర్పించింది. ప్రభుత్వం ఈ రెండు సంస్థల అమ్మకం కోసం ప్రైస్‌ బిడ్స్‌ ఆహ్వానించిన వెంటనే ఈ 1,000 కోట్ల డాలర్ల నిధి ఏర్పాటవుతుందని అగర్వాల్‌ చెప్పారు. వేదాంత గ్రూపు  నిర్వహణలో ఈ ప్రత్యేక ఫండ్‌ ఏర్పాటు చేస్తారు. ఇందులో  పెట్టుబడులు పెట్టేందుకు అనేక సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌ ఆసక్తితో ఉన్నట్టు అగర్వాల్‌ చెప్పారు. వేదాంతగ్రూపు బాల్కో, హిందూస్థాన్‌ జింక్‌ వంటి పీఎ్‌సయూలను కొనుగోలు చేసి, మంచి లాభాల్లో నడిపిస్తోంది. అదే విధంగా బీపీసీఎల్‌, ఎస్‌సీఐలను కొనుగోలు చేయాలని భావిస్తోంది.

Updated Date - 2022-01-24T06:59:31+05:30 IST