వేతనంలో కోతపై 1న నిరసన.. ఉద్యోగుల నిర్ణయం

ABN , First Publish Date - 2020-05-29T11:43:41+05:30 IST

వేతనంలో కోతపై 1న నిరసన.. ఉద్యోగుల నిర్ణయం

వేతనంలో కోతపై 1న నిరసన.. ఉద్యోగుల నిర్ణయం

హైదరాబాద్: మే నెల వేతనంలోనూ కోత విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ జూన్‌ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌, కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకుల వైఫల్యమే ఇందుకు పరోక్ష కారణమని కమిటీ ఆక్షేపించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన కమిటీ సమావేశంలో 30 మంది హాజరయ్యారు.

Updated Date - 2020-05-29T11:43:41+05:30 IST