నేడు దేశవ్యాప్తంగా నిరసనలు: హరగోపాల్
ABN , First Publish Date - 2020-09-22T08:31:54+05:30 IST
నేడు దేశవ్యాప్తంగా నిరసనలు: హరగోపాల్
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ అణచివేత ధోరణికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల సంఘాల సమన్వయ సంస్థ పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నట్లు నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. ప్రజా సంఘాల నేతలు, ప్రజలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరవరరావు, సాయిబాబాతో సహా రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.