రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
ABN , First Publish Date - 2020-02-24T09:19:29+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
- పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
నెల్లూరు (వైద్యం), ఫిబ్రవరి 23: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చి మత, కుల ప్రాతిపదికన ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని శైలజానాథ్ విమర్శించారు.