ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం ఓం ప్రకాష్ మిశ్రాకు పదోన్నతి
ABN , First Publish Date - 2021-05-15T06:02:13+05:30 IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ విధులు నిర్వర్తిస్తున్న ఓం ప్రకాష్ మిశ్రా..
మంగళ్హాట్ (ఆంధ్రజ్యోతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ విధులు నిర్వర్తిస్తున్న ఓం ప్రకాష్ మిశ్రా.. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఎస్బీఐ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్గా సేవలందిస్తున్న అజయ్ కుమార్ సింగ్ను చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా నియమించింది. ఈ సందర్భంగా ఓం ప్రకాష్ మిశ్రా, అజయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు.