కరోనాపై క్రికెటర్ కోహ్లీ ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2020-03-14T16:04:42+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై క్రికెటర్ విరాట్ కోహ్లీ మొట్టమొదటిసారి పెదవి విప్పారు.....

కరోనాపై క్రికెటర్ కోహ్లీ ఏమన్నారంటే...

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై క్రికెటర్ విరాట్ కోహ్లీ మొట్టమొదటిసారి పెదవి విప్పారు. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అభిమానులకు శనివారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. కరోనా వైరస్ నిరోధానికి అభిమానులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోహ్లీ శనివారం ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వచ్చాక నివారణ కంటే ముందుజాగ్రత్తే మేలు అని కోహ్లీ ట్వీట్ చేశారు. ‘‘అందరూ కరోనా వైరస్‌పై పోరాడేందుకు దృఢచిత్తంతో ముందుకు కదలండి, అందరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోండి’’ అంటూ కోహ్లీ సూచించారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు క్రీడల పోటీలను వాయిదా వేసిన నేపథ్యంలో కోహ్లీ తన అభిమానులకు ముందస్తు జాగ్రత్తలు చెప్పారు. ఐపీఎల్ తోపాటు క్రికెట్ పోటీలను వాయిదా వేస్తూ బీసీసీఐ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లు నిర్ణయించిన దృష్ట్యా కోహ్లీ తన అభిమానులకు కరోనాపై తాజా సూచనలు జారీ చేశారు.

Updated Date - 2020-03-14T16:04:42+05:30 IST