భూ మార్పిడికి రంగం సిద్ధం

ABN , First Publish Date - 2020-11-13T08:46:57+05:30 IST

వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడికి రంగం సిద్ధమయింది. త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌లో దీనికోసం ఆప్షన్‌ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాంతో సాంకేతిక

భూ మార్పిడికి రంగం సిద్ధం

వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడికి రంగం సిద్ధమయింది. త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌లో దీనికోసం ఆప్షన్‌ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాంతో సాంకేతిక నిపుణుల బృందం కసరత్తును ముమ్మరం చేసింది. భూమార్పిడికి ఎంత చార్జీ వసూలు చేయాలనే అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. తెలంగాణ వ్యవసాయ భూముల చట్టం-2020 ఇప్పటికే ఆమోదం పొందింది.


భూమార్పిడిపై ఆర్డీవోకు ఉన్న అధికారాలను తహసీల్దార్‌లకు బదలాయిస్తూ కొత్త చట్టాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. వ్యవసాయేతర భూమిగా మార్పిడి అయిన వెంటనే ఆ భూమిని ధరణి(వ్యవసాయ) రికార్డుల నుంచి తొలగించి.. వ్యవసాయేతర భూముల (ధరణి-వ్యవసాయేతర) ఖాతాలోకి చేరుస్తారు.


Updated Date - 2020-11-13T08:46:57+05:30 IST