టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలి: ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-04-11T01:54:00+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి బహుజన రాజ్య స్థాపన కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలి: ప్రవీణ్‌కుమార్‌

గరిడేపల్లి: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి బహుజన రాజ్య స్థాపన కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణులు పశువులు, గొర్రెల కాపర్లుగా, గుమస్తాలుగా కాకుండా మంత్రి కేటీఆర్‌లా కంపెనీలు, కర్మాగారాలు స్థాపించే స్థాయికి ఎదగాలన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఉపఎన్నికలో ఇచ్చిన హామీల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. జిల్లాలో అతి పెద్దదైన గరిడేపల్లి మండలానికి ఇంటర్మీడియట్‌, డిగ్రీ కళాశాల మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-11T01:54:00+05:30 IST