ప్రకాశం జిల్లాలో మరో 348 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-08-07T13:37:34+05:30 IST
ప్రకాశం జిల్లాలో మరో 348 కరోనా కేసులు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 348 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8268 చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు 91 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 1,60,742 శ్యాంపిళ్లు పంపగా...అందులో 1,49,545 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 4177 రిపోర్టులు రావాల్సి ఉంది. నిన్న కరోనా నుండి కోలుకుని 100 మంది డిశ్చార్జ్ అయ్యారు. 34 మందిని హోం ఐసోలేషన్కు పంపారు. జిల్లాలో ప్రస్తుతం 1366 యాక్టివ్ కేసులు ఉన్నాయి.