ప్రకాశం: మాజీ పంచాయితీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
ABN , First Publish Date - 2020-09-20T16:03:48+05:30 IST
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో మాజీ పంచాయితీ కార్యదర్శి క్రిష్టమూర్తిపై సస్పెన్షన్ వేటు పండింది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో మాజీ పంచాయితీ కార్యదర్శి క్రిష్టమూర్తిపై సస్పెన్షన్ వేటు పండింది. కె.బిట్రగుంటలో ఇంటి పన్ను రూ. 7.30 లక్షలను దుర్వినియోగం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో క్రిష్టమూర్తిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిష్టమూర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం వర్దినేనిపాలెం పంచాయతీ కార్యదర్శిగా కృష్ణమూర్తి పనిచేస్తున్నారు.