ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రభావతి

ABN , First Publish Date - 2022-09-27T06:56:26+05:30 IST

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. నెల్లూరులోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఐద్వా రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా 55

ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రభావతి

నెల్లూరు(వైద్యం)సెప్టెంబరు 26: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. నెల్లూరులోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఐద్వా రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా 55 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రభావతి, ప్రధాన కార్యదర్శిగా రమాదేవి, కోశాధికారిగా సావిత్రి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ మహిళల హక్కుల పరిరక్షణ, బాలికల విద్యకు విఘాతం కలిగించే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే అధిక ధరలను అరికట్టాలని, ప్రజా పంపిణీ వ్యవస్ధను పటిష్ఠం చేయాలన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని, మద్యం, మత్తు మందులను నియంత్రించాలని, ప్రజాస్వామ్య హక్కులపై దాడి, నిర్బంధాలు ఆపాలని తీర్మానాలు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2022-09-27T06:56:26+05:30 IST