అధికారమొక్కటే శాశ్వతం!
ABN , First Publish Date - 2021-04-04T05:30:00+05:30 IST
వినూత్న పాత్రలతో తనలోని నటిని ప్రేక్షకలోకానికి సరికొత్త గా పరిచయం చేస్తున్నారు రమ్యకృష్ణ. సరైన పాత్ర పడాలే
వినూత్న పాత్రలతో తనలోని నటిని ప్రేక్షకలోకానికి సరికొత్త గా పరిచయం చేస్తున్నారు రమ్యకృష్ణ. సరైన పాత్ర పడాలే గానీ తెరపై ఆమె తనదైన నటనతో విజృంభిస్తారు. ‘బాహుబలి’ చిత్రంలో శివగామిగా ప్రేక్షకులకు పదికాలాల పాటు గుర్తుండిపోయేనటనను కనబరిచారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రిపబ్లిక్’. సాయిఽతేజ్ కథానాయకుడుగా దేవ్కట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కుతోంది. ఇందులో ఆమె రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నారు.
ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఫస్ట్లుక్ను చిత్రబృందం ట్విట్టర్లో విడుదల చేసింది. ఇందులో ఆమె విశాఖవాణి అనే రాజకీయనాయకురాలి పాత్రలో కనిపించనున్నారు. ‘తప్పు ఒప్పులు లేవు. అధికారం ఒక్కటే శాశ్వతం’ అనే క్యాప్షన్తో రాజకీయనాయకురాలిగా ఆమె పాత్ర స్వభావాన్ని వెల్లడించారు. ఫస్ట్లుక్ను సాయితేజ్ షేర్ చేసి ‘రమ్యకృష్ణ గారి లాంటి గొప్ప నటితో కలసి పనిచేయటం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఆమె నటనను తెరపై చూడాలని ఆసక్తిగా ఉంది’’ అని చెప్పారు. జూన్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.