బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు: పొన్నం

ABN , First Publish Date - 2020-11-29T21:56:51+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని

బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు: పొన్నం

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి అభ్యర్థులు దొరక్క కాంగ్రెస్‌ నేతలను చేర్చుకొని టికెట్లు ఇచ్చారని విమర్శించారు. కులం, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో అల్లర్లకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జాతీయ నేతలు అవసరమా? హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు అమిత్‌షా ఎక్కడున్నారు? అమిత్‌షా ఏ మొహం పెట్టుకొని హైదరాబాద్‌ వచ్చారని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.


టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందేమీలేదు: కొండా

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందేమీలేదని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. డబుల్‌ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో టీఆర్‌ఎస్‌ మోసం చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. హైదరాబాద్‌ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. మా పోటీ కేవలం బీజేపీతోనే.. టీఆర్ఎస్‌తో కాదన్నారు. టీఆర్‌ఎస్‌ డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తోందని ఆరోపించారు. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో మెజార్టీ సీట్లు గెలవబోతున్నట్లు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-11-29T21:56:51+05:30 IST