జగ్గారెడ్డి దీక్షకు పొన్నాల సంఘీభావం

ABN , First Publish Date - 2021-12-23T18:23:07+05:30 IST

ఇంటర్ బోర్డ్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య సంఘీభావం తెలిపారు.

జగ్గారెడ్డి దీక్షకు పొన్నాల సంఘీభావం

హైదరాబాద్: ఇంటర్ బోర్డ్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేయడం ఏంటి? ఫెయిల్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలో నెట్టొద్దు. ప్రభుత్వం ఈ అంశంపై స్పందించకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులకు న్యాయం చేయాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-23T18:23:07+05:30 IST