27న పాలిసెట్
ABN , First Publish Date - 2020-09-23T09:58:04+05:30 IST
27న పాలిసెట్
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్-2020) నిర్వహించనున్నారు. ఈ నెల 17 తర్వాత డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లు చెల్లుబాటవుతాయని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి కె.విజయభాస్కర్ తెలిపారు.