బాబుపై పోస్టులు పెట్టిన వారినిఅరెస్ట్ చేయాలి
ABN , First Publish Date - 2020-03-22T11:20:35+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై జుగుప్సాకరమైన రీతిలో మార్ఫింగ్ చేసిన ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టిన నిందితులను..
పోలీసులకు ఎమ్మెల్సీ అశోక్బాబు ఫిర్యాదు
మంగళగిరి క్రైమ్, మార్చి 21: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై జుగుప్సాకరమైన రీతిలో మార్ఫింగ్ చేసిన ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టిన నిందితులను అరెస్ట్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఎమ్మెల్సీ తరపున స్థానిక టీడీపీ నేతలు మజీద్, రియాజ్ రూరల్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డికి శనివారం సాయంత్రం అందజేశారు.
చంద్రబాబుపై అత్యంత అభ్యంతరకరమైన భాషతో పాటు మార్ఫింగ్ చేసిన ఫొటోలతో వ్యక్తిగత, పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఫేస్బుక్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం కొనసాగుతోందని, తద్వారా కొన్నివర్గాల మధ్య ఘర్షణ, మనస్పర్ధలు కలిగించే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగుదేశంపార్టీ, నాయకుల పరువు దిగజార్చే ఉద్దేశ్యంతో భాస్కర్రెడ్డి అనే వ్యక్తి తన ఫేస్బుక్లో నిరంతరం పోస్టులు పెడుతున్నాడని, అతనితో పాటు దీని వెనుక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని అశోక్బాబు తన ఫిర్యాదులో విజ్ఞప్తిచేశారు.