అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు
ABN , First Publish Date - 2021-01-21T22:57:16+05:30 IST
సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రథమ నిందితురాలైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
హైదరాబాద్: సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రథమ నిందితురాలైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై శుక్రవారం సికింద్రాబాద్ కోర్టులో విచారిస్తారు. అఖిలప్రియ భర్త భార్గవ్రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేశారు.
ఈ కిడ్నాప్ కేసులో నిందితులలో ఇద్దరిని పోలీసులు బుధవారం జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. అఖిలప్రియ వ్యక్తిగత కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, మరో నిందితుడు బోయ సంపత్లను మూడు రోజులపాటు కస్టడీకి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. చంచల్గూడ జైల్లో ఉన్న వారిద్దరినీ బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కిడ్నాప్ కేసులో నకిలీ ఆస్తి పత్రాలు సమకూర్చడం, స్టాంపు పేపర్ల సేకరణ, నకిలీ నెంబర్ ప్లేట్ల తయారీలో మల్లికార్జున్ రెడ్డి కీలకంగా వ్యవహరించాడు.