Odisha: 21 క్వింటాళ్ల గంజాయి సీజ్..26 మంది అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-25T15:07:48+05:30 IST
ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు....
గజపతి : ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కోటిన్నర రూపాయల విలువగల 21 క్వింటాళ్ల గంజాయిని నాలుగు ట్రక్కుల్లో అక్రమంగా తరలిస్తుండగా ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారని ఒడిశా డీఎస్పీ ఉదయగిరి చెప్పారు. ఒడిశా రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. నిందితులపై కేసు నమోదు చేసి గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.