మందుబాబుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు
ABN , First Publish Date - 2021-12-31T23:03:50+05:30 IST
మందుబాబుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటికే డీ అండ్ డీ తనిఖీలు మొదలైయ్యాయి.
హైదరాబాద్: మందుబాబుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటికే డీ అండ్ డీ తనిఖీలు మొదలైయ్యాయి. మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా 100 టీమ్స్తో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వం నయాసాల్ సంబరాలకు పచ్చజెండా ఊపడంతో పార్టీ ప్రియుల్లో జోష్ నెలకొంది. ఒమైక్రాన్ భయం నెలకొన్నా ఏదో రకంగా పార్టీ చేసుకోవాలని నగర వాసులు సిద్ధమవుతున్నారు. ఇక పబ్లు, రెస్టారెంట్లైతే పార్టీ ప్రియులను ఆకర్షించేందుకు అన్ని హంగామాలు చేస్తున్నాయి. ఈ ఉత్సాహం విషాదం కావద్దనేది అందరూ కోరుకుంటారు. మద్యం మత్తులో తప్పులో కాలేయడం యాదృచ్ఛికంగా జరిగిపోతుంటుంది. ఈ నయాసాల్ హుషారు ఎప్పటికీ గుర్తుండాలంటే నిబంధనలను పాటించి తీరాల్సిందేనని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. పబ్లు, రెస్టారెంట్లు, కాఫీ సెంటర్లు, బార్లు, మద్యం షాపులు ఇలా ప్రతి ఒక్కరూ తమ సూచనలకు లోబడి నడుచుకోవాలని నిర్వాహకులకు నోటీసులు సైతం జారీ చేశారు.