వైసీపీ ప్రభుత్వంలో Polavaram పూర్తికాదు: హర్షకుమార్‌

ABN , First Publish Date - 2022-06-02T02:19:21+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదని మాజీ ఎంపీ హర్షకుమార్‌ జోస్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని తప్పుబట్టారు.

వైసీపీ ప్రభుత్వంలో Polavaram పూర్తికాదు: హర్షకుమార్‌

రాజమహేంద్రవరం: వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదని మాజీ ఎంపీ హర్షకుమార్‌ జోస్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి, ఇప్పుడు దాన్ని బ్యారేజీ స్థాయికి తీసుకొచ్చారని విమర్శించారు. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. భూములు కొనుగోళ్లు చేసి వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని హర్షకుమార్ తెలిపారు. 

Updated Date - 2022-06-02T02:19:21+05:30 IST