పోలెండ్‌ చాంప్‌ వినేశ్‌

ABN , First Publish Date - 2021-06-12T10:41:39+05:30 IST

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ పోలెండ్‌ ఓపెన్‌లో సత్తా చాటింది. మహిళల 53 కిలోల విభాగంలో చాంపియన్‌గా నిలిచి టోక్యో ఒలింపిక్స్‌లో హాట్‌ ఫేవరెట్‌నంటూ ప్రత్య ర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది.

పోలెండ్‌ చాంప్‌ వినేశ్‌

ఈ సీజన్‌లో మూడో స్వర్ణం సొంతం


వార్సా: భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ పోలెండ్‌ ఓపెన్‌లో సత్తా చాటింది. మహిళల 53 కిలోల విభాగంలో చాంపియన్‌గా నిలిచి టోక్యో ఒలింపిక్స్‌లో హాట్‌ ఫేవరెట్‌నంటూ ప్రత్య ర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది. శుక్రవారం జరిగిన ఫైనల్‌ బౌట్‌లో వినేశ్‌ 8-0తో ఉక్రెయిన్‌ రెజ్లర్‌ క్రిస్టీనా బెరెజాను చిత్తుగా ఓడించి పసిడి పతకం అందుకుంది. అంతకుముందు రౌండ్లలో వినేశ్‌ .. ప్రపంచ కాంస్య పతక విజేత ఎకటరీనా పోలెచుక్‌ (రష్యా), అమెరికా రెజ్లర్‌ అమీ అన్‌ ఫెర్న్‌సైడ్‌లపై గెలిచింది. 26 ఏళ్ల వినేశ్‌కిది సీజన్‌లో మూడో టైటిల్‌ కావడం విశేషం. ఈ ఏడాది మార్చిలో మ్యాటె పెలికోన్‌ ఈవెంట్‌లో, ఏప్రిల్‌లో ఆసియా చాంపియన్‌ షిప్‌లో స్వర్ణాలు నెగ్గింది. కాగా, మహిళల 57 కిలోల విభాగంలో తలపడాల్సిన భారత రెజ్లర్‌ అన్షు మాలిక్‌ జ్వరం కారణంగా పోలెండ్‌ ఈవెంట్‌ నుంచి వైదొలిగింది.

Updated Date - 2021-06-12T10:41:39+05:30 IST