టీఆర్‌ఎస్‌ది అవినీతి పాలన: పీయూష్‌ గోయల్‌

ABN , First Publish Date - 2022-07-03T21:24:42+05:30 IST

తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మండిపడ్డారు.

టీఆర్‌ఎస్‌ది అవినీతి పాలన: పీయూష్‌ గోయల్‌

హైదరాబాద్: తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మండిపడ్డారు. దేశంలో నెం1గా ఎదిగే సామర్థ్యం తెలంగాణకు ఉందన్నారు. దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎందరో త్యాగాలు చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కష్టాలు పెరిగాయన్నారు. టీఆర్‌ఎస్‌ది అవినీతి పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-03T21:24:42+05:30 IST