‘ఇళ్లపట్టాలు నాలుకగీసుకోవడానికి పనికిరావు’

ABN , First Publish Date - 2021-10-11T23:41:28+05:30 IST

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతకాలం గాలిమాటలతో ప్రజలను మోసగించాలని చూస్తారు? అని మాజీమంత్రి పీతలసుజాత ప్రశ్నించారు.

‘ఇళ్లపట్టాలు నాలుకగీసుకోవడానికి పనికిరావు’

అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతకాలం గాలిమాటలతో ప్రజలను మోసగించాలని చూస్తారు? అని మాజీమంత్రి  పీతలసుజాత ప్రశ్నించారు. 28 లక్షలమంది పేదలకు ఇళ్లస్థలాలిచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని ప్రభుత్వం చెప్పిందన్నారు. దేశంలోనే తమప్రభుత్వం పెద్దరికార్డు సాధించబోతోందంటూ డబ్బాలుకొట్టుకుందని చెప్పారు. నివాసానికి  పనికిరాని స్థలాలను ఇళ్లనిర్మాణానికి కేటాయించడంలో ఈ ప్రభుత్వం  నిజంగానే రికార్డు సాధించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వమిచ్చిన ఇళ్లపట్టాలు నాలుకగీసుకోవడానికి కూడా పనికిరావని విమర్శించారు. జగన్ ప్రభుత్వం పార్టీలు, రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలకు మంచిచేస్తే సంతోషిస్తామన్నారు. 

Updated Date - 2021-10-11T23:41:28+05:30 IST