స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పింగళి వెంకయ్య మునిమనుమరాలు

ABN , First Publish Date - 2020-08-15T18:00:14+05:30 IST

విజయవాడ: అమృతహస్తం ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలలో పింగళి వెంకయ్య ముని మనుమరాలు గీతా మాధుర్య పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పింగళి వెంకయ్య మునిమనుమరాలు

విజయవాడ: అమృతహస్తం ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలలో పింగళి వెంకయ్య ముని మనుమరాలు గీతా మాధుర్య పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. పేదలకు గీతా మాధుర్య అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీతా మాధుర్య మాట్లాడుతూ.. స్వాంత్ర్యోద్యమ చరిత్ర, మహనీయుల త్యాగాల గురించి నేటి తరాలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.


పాలకులు జాతీయ పతాకాలను ఎగుర వేస్తున్నా.. రూపశిల్పి పింగళి వెంకయ్య గురించి ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. పింగళి వెంకయ్య పేరు ఎక్కడా వినిపించడం లేదన్నారు. ఆయనకు గుర్తింపు కూడా రాలేదన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలకు గానూ.. భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరుతున్నానని గీతామాధుర్య పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-15T18:00:14+05:30 IST