సీఎం పేషీ నుంచి కొత్త మంత్రులకు ఫోన్లు
ABN , First Publish Date - 2022-04-10T20:21:22+05:30 IST
సీఎం పేషీ నుంచి కొత్త మంత్రులకు ఫోన్లు వెళ్లాయి. ఫోన్ రావడంతో ధర్మాన ప్రసాదరావు విజయవాడ బయల్దేరారు.
అమరావతి: సీఎం పేషీ నుంచి కొత్త మంత్రులకు ఫోన్లు వెళ్లాయి. ఫోన్ రావడంతో ధర్మాన ప్రసాదరావు విజయవాడ బయల్దేరారు. కొత్త, పాత మంత్రులకు సీఎం పేషీ నుంచి ఫోన్లు వెళ్లాయి. మరికొందరికి జీఏడీ నుంచి ఫోన్లు వచ్చాయి. సోమవారం ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రేపటి కార్యక్రమం షెడ్యూల్ను కొత్త మంత్రులకు జీఏడీ పంపనుంది. నెల్లూరులో కాకాని గోవర్ధన్రెడ్డి ఇంటి దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు.
ఏపీ మంత్రుల తుది జాబితా
విజయనగరం జిల్లా నుంచి బొత్స, రాజన్నదొర
శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు
విశాఖ జిల్లా నుంచి భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్
తూ.గో జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, చిట్టి బాబు, వేణుగోపాల కృష్ణ
ప.గో: జిల్లా నుంచి కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్
కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, కొడాలి నాని, రక్షణనిధి
గుంటూరు జిల్లా నుంచి విడదల రజనీ, మేరుగ నాగార్జున
ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్
నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్దన్ రెడ్డి
చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కడప జిల్లా నుంచి అంజాద్ బాషా, కొరుముట్ల శ్రీనివాస్
కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, గుమ్మనూరు జయరాం
అనంతపురం జిల్లా నుంచి జొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారాయణ