చైనా యాప్‌లపై శాశ్వ‌త కొరడా...

ABN , First Publish Date - 2021-01-26T20:39:05+05:30 IST

టిక్‌టాక్ 'సహా చైనాకు చెందిన మొత్తం 58 యాప్‌లపై భారత్ శాశ్వత నిషేధం విధించినట్టు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.

చైనా యాప్‌లపై శాశ్వ‌త కొరడా...

న్యూఢిల్లీ : టిక్‌టాక్ 'సహా చైనాకు చెందిన మొత్తం 58  యాప్‌లపై భారత్ శాశ్వత నిషేధం విధించినట్టు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. కిందటి సంవత్సరం జూన్‌లో వీటిపై భార‌త ప్ర‌భుత్వం తాత్కాలిక నిషేధం విధించ‌గా, తాజాగా శాశ్వ‌త  నిషేధం దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ  ఇప్పటికే నోటీసులు కూడా జారీ అయినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 


భారతీయ వినియోగదారుల డేటాను అక్రమంగా సేక‌రించి దుర్వినియోగం చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లపై ఆయా సంస్థల వివరణను కోరిన కేంద్రం... అవి ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెంద‌లేదు. తో ఆ 59 యాప్‌లనుశాశ్వ‌తంగా నిషేధించాల‌ని నిర్ణ‌యించింది. కాగా... గత ఆరు నెలలుగా  ప్రభుత్వం మరో 208 యాప్‌లను నిషేధించిన విష‌యం తెలిసిందే.

Updated Date - 2021-01-26T20:39:05+05:30 IST