గత మూడు రోజులుగా వరద నీటిలోనే నివాసం: బాధితులు
ABN , First Publish Date - 2020-09-29T17:54:57+05:30 IST
ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద నీరు చేరడంతో విజయవాడలోని రామలింగేశ్వరనగర్..
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద నీరు చేరడంతో విజయవాడలోని రామలింగేశ్వరనగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్ ముంపునకు గురయ్యాయి. సుమారు 4 వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. గత మూడు రోజులుగా వరద నీటిలోనే జీవనాన్ని గడుపుతున్నామని, విష సర్పాలు కూడా ఇళ్లల్లోకి రావడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారికి చాలా దూరంలో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కట్టపైనే ఉన్నామని, తమను ఎవరూ పట్టించుకోవడంలేదని బాధితులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. అధికారులు వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళ్లిపోతున్నారు.. తప్ప తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ముంపు నుంచి తమను కాపాడాలంటే తక్షణమే రిటర్నింగ్ వాల్ నిర్మించాలని బాధితులు కోరుతున్నారు.