Peddapalli: మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-04-19T14:02:26+05:30 IST
జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కనుకులలో దారుణం జరిగింది. మైనర్ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.
పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కనుకులలో దారుణం జరిగింది. మైనర్ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించారు. దీంతో ప్రియుడు శివ పురుగుల మందు తాగి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ప్రియురాలు సుస్మిత బావిలో దూకి తనువు చాలించింది. ఇరువురు మృతి చెందడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.