రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు నడుస్తున్నాయి: శైలజానాథ్

ABN , First Publish Date - 2020-10-30T17:41:32+05:30 IST

రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు కొనసాగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా పాలన సాగుతోందన్నారు. పోలవరంపై నరేంద్రమోదీ మోసం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని

రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు నడుస్తున్నాయి: శైలజానాథ్

అనంతపురం: రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు కొనసాగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా పాలన సాగుతోందన్నారు. పోలవరంపై నరేంద్రమోదీ మోసం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సొంతింటి వ్యవహారం లాగా పాలనసాగుతోందన్నారు. అధికారంలోకి రాక ముందు జగన్మోహన్ రెడ్డికి అన్నీ అనుమానాలేనని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతో పోలవరం నిర్మాణం కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు.


తులసిరెడ్డి...

నరేంద్రమోదీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వల్ల విభజన చట్టంలో ఒక్క హామీ కూడా అమలుకాలేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ పౌరుషం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. పులివెందుల ఢిల్లీకి ఫైట్ అన్నావ్... ఇప్పుడు కేంద్రానికి దాసోహం అయ్యావని విమర్శించారు. జగన్‌కు శశికళ గుర్తువస్తుందని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-10-30T17:41:32+05:30 IST