‘దోచుకున్న డబ్బులోంచి పుట్టింది కాబట్టే’

ABN , First Publish Date - 2020-02-22T00:58:07+05:30 IST

దోచుకున్న డబ్బులోంచి పుట్టింది కాబట్టే.. సాక్షి పత్రిక దొంగ రాతలు రాస్తోందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. సాక్షి పత్రిక దొంగ రాతలు రాస్తోందని ఫైర్

‘దోచుకున్న డబ్బులోంచి పుట్టింది కాబట్టే’

అమరావతి: దోచుకున్న డబ్బులోంచి పుట్టింది కాబట్టే.. సాక్షి పత్రిక దొంగ రాతలు రాస్తోందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. సాక్షి పత్రిక దొంగ రాతలు రాస్తోందని ఫైర్ అయ్యారు. పదేళ్లుగా చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటిస్తోందని చెప్పారు. సీబీఐ, ఈడీలు ప్రకటించేంత వరకు జగన్‌లా వేచి చూడటం లేదన్నారు. ప్రకటించిన ఆస్తుల కంటే రూపాయి ఎక్కువ ఉన్నా.. వైసీపీ చెప్పిన ట్రస్ట్‌కు రాసిస్తానని లోకేష్ సవాల్ విసిరారని గుర్తుచేశారు. ఆ సవాల్‌కు స్పందించి వైసీపీ నుంచి ఒక్క మగాడు కూడా బయటకు రావడంలేదని విమర్శలు గుప్పించారు. సాక్షి తప్పుడు రాతలపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారని, కుక్కతోక వంకరలా సాక్షి తన పద్దతి మార్చుకోవడంలేదని దుయ్యబట్టారు. జగన్‌కు దమ్ముంటే తన ఆస్తుల వివరాలు వెల్లడించాలని సవాల్ విసిరారు. శిక్ష పడుతుందన్న భయంతోనే కుంటిసాకులు చెబుతూ కోర్టులకు వెళ్లకుండా జగన్ తప్పించుకు తిరుగుతున్నాడని విమర్శించారు.

Updated Date - 2020-02-22T00:58:07+05:30 IST