పెద్దిరెడ్డి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారు: పట్టాభి

ABN , First Publish Date - 2021-04-17T19:44:35+05:30 IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభి పేర్కొన్నారు.

పెద్దిరెడ్డి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారు: పట్టాభి

తిరుపతి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కొమ్మారెడ్డి  పట్టాభిరామ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....  పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి తిరుపతిలో ఎందుకున్నారు? అని పట్టాభి ప్రశ్నించారు. దొంగఓటర్లను తరలించే కొత్త అవతారమెత్తిన పెద్దిరెడ్డికి తిరుపతిలో ఉండే హక్కు ఎక్కడిది? అని ప్రశ్నించారు. నకిలీ ఓటర్ కార్డులు పట్టుకొని పోలింగ్ కేంద్రాల ముందున్న దొంగ ఓటర్లను.. మీడియాకు అప్పగించినా ఇంకా దబాయిస్తారా? అని నిలదీశారు. దొంగ ఓట్లు వేయించడం.. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడమే పెద్దిరెడ్డి చేస్తున్న పని అని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకోవాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. టీడీపీ ప్రజాస్వామ్యబద్ధంగానే పనిచేస్తుందన్నారు.  రాష్ట్ర మంత్రులు బరితెగించి మీడియాను, ఓటర్లను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు, అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పట్టాభిరామ్ తెలిపారు.

Updated Date - 2021-04-17T19:44:35+05:30 IST