జగన్ చేతిలో సీఐడీ కీలుబొమ్మ: పట్టాభి
ABN , First Publish Date - 2021-12-16T18:22:10+05:30 IST
జగన్ ప్రభుత్వ చేతిలో సీఐడీ కీలుబొమ్మలా మారిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు.
అమరావతి : జగన్ ప్రభుత్వ చేతిలో సీఐడీ కీలుబొమ్మలా మారిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఐడీని అడ్డంపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు.కుట్రపూరితంగానే లక్ష్మీనారాయణ, సుబ్బారావును అరెస్ట్ చేశారన్నారు. నిజాయితీపరులకు అవినీతి మరక అంటగడతారా? అని ప్రభుత్వ తీరును నిలదీశారు. సీఐడీ రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రిమాండ్ రిపోర్ట్లో అవాస్తవాలు నమోదు చేశారని చెప్పారు. డిజైన్టెక్ సంస్థ పన్ను ఎగవేతకు.. స్కిల్ డెవలప్మెంట్కు ఏం సంబంధం? ఉందని ప్రశ్నించారు. షెల్ కంపెనీలకు వెళ్లిన డబ్బంతా మళ్లీ డిజైన్టెక్ సంస్థకే మళ్లిందని రాశారన్నారు. కొందరి జేబుల్లోకి డబ్బు వెళ్లిందని ఎలా చెబుతారని అడిగారు. చెంచాగిరి డిపార్ట్మెంట్గా సీఐడీ మారిపోయిందని పట్టాభి అన్నారు.