కరీంనగర్ పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
ABN , First Publish Date - 2022-04-10T01:30:26+05:30 IST
కరీంనగర్ సీపీ సహా పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది.
ఢిల్లీ: కరీంనగర్ సీపీ సహా పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై దాడి, అక్రమ అరెస్టు కేసులో.. కరీంనగర్ సీపీ సత్యనారాయణకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న కమిటీ ఎదుట హాజరుకావాలని పోలీసులకు నోటీసులు పంపించింది. కరీంనగర్ ఏసీపీ, హుజురాబాద్ ఏసీపీ, సీఐ, జమ్మికుంట సీఐ.. కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్కు నోటీసులు జారీ చేసింది. సీఎస్ సోమేష్కుమార్కు కూడా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ కాపీ పంపించింది.