కరీంనగర్ పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

ABN , First Publish Date - 2022-04-10T01:30:26+05:30 IST

కరీంనగర్ సీపీ సహా పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది.

కరీంనగర్ పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

ఢిల్లీ: కరీంనగర్ సీపీ సహా పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, అక్రమ అరెస్టు కేసులో.. కరీంనగర్ సీపీ సత్యనారాయణకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న కమిటీ ఎదుట హాజరుకావాలని పోలీసులకు నోటీసులు పంపించింది. కరీంనగర్‌ ఏసీపీ, హుజురాబాద్‌ ఏసీపీ, సీఐ, జమ్మికుంట సీఐ.. కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. సీఎస్‌ సోమేష్‌కుమార్‌కు కూడా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ  కాపీ పంపించింది. 

Updated Date - 2022-04-10T01:30:26+05:30 IST