చంచల్గూడ జైలుకు ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రులు
ABN , First Publish Date - 2022-06-27T16:53:48+05:30 IST
ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థుల తల్లిదండ్రులు సోమవారం ఉదయం చంచలగూడ జైలుకు చేరుకున్నారు.
హైదరాబాద్: ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థుల తల్లిదండ్రులు సోమవారం ఉదయం చంచలగూడ జైలుకు చేరుకున్నారు. అరెస్ట్ అయిన తమ పిల్లలను ములాకత్ ద్వారా కలుసుకునేందుకు బాధిత కుటుంబాలు జైలుకు వచ్చాయి. తమ పిల్లలు జైల్లో ఉండటంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పిల్లలను బయటకు తీసుకురావాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన సూత్రధారి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుబ్బారావు చంచల్గూడ జైలులో ఉన్నాడు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని సుబ్బారావు తరపు న్యాయవాదులు ఈరోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.