పేపర్‌ లీకేజీ కేసులో గెస్ట్‌ లెక్చరర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2022-04-26T16:09:34+05:30 IST

రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు వాట్సాప్ లో లీక్‌ కావడానికి కారకురాలిగా భావించి మైసూరుకు చెందిన గెస్ట్‌ లెక్చరర్‌ సౌమ్య ఆర్‌ను సోమవారం

పేపర్‌ లీకేజీ కేసులో గెస్ట్‌ లెక్చరర్‌ అరెస్టు

బెంగళూరు: రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు వాట్సాప్ లో లీక్‌ కావడానికి కారకురాలిగా భావించి మైసూరుకు చెందిన గెస్ట్‌ లెక్చరర్‌ సౌమ్య ఆర్‌ను సోమవారం అరెస్టు చేశారు. భూగోళ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నప్రతంలోని 18 ప్రశ్నలను వాట్సాప్‌ ద్వారా లీక్‌ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కర్ణాటక పరీక్షా ప్రాధికార మార్చి 14న 1200 పోస్టులకు పరీక్షలు నిర్వహించింది. ప్రశ్నపత్రం లీక్‌పై పరీక్షా ప్రాధికార ఫిర్యాదుతో మల్లేశ్వరం పోలీసులు విచారణ జరుపుతున్నారు. మైసూరుకు చెందిన గెస్ట్‌లెక్చరర్‌ సౌమ్య సూత్రధారిగా భా వించిన పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2022-04-26T16:09:34+05:30 IST