బాబుని తిట్టే టైమ్‌ను.. రైతు సమస్యలపై పెట్టండి: పంచుమర్తి అనురాధ

ABN , First Publish Date - 2020-04-10T19:31:19+05:30 IST

అమరావతి: చంద్రబాబుని తిట్టడానికి వినియోగించే సమయాన్ని రైతు సమస్యల కోసం వెచ్చించాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యవసాయశాఖామంత్రి కన్నబాబుకి సూచించారు.

బాబుని తిట్టే టైమ్‌ను.. రైతు సమస్యలపై పెట్టండి: పంచుమర్తి అనురాధ

అమరావతి: చంద్రబాబుని తిట్టడానికి వినియోగించే సమయాన్ని రైతు సమస్యల కోసం వెచ్చించాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యవసాయశాఖామంత్రి కన్నబాబుకి సూచించారు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తోందని ఆమె ట్విట్టర్ వేదికగా వాపోయారు. ‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు గారిని తిట్టడానికి వెచ్చిస్తున్న సమయం రైతుల సమస్యలపై పెడితే కొంతైనా రైతులకు ఉపశమనం వస్తుంది. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు గుర్తిస్తే మంచిది.


 ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. కనీసం రవాణా సౌకర్యం కూడా లేదు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో రైతులు అరటి పంటను అమ్ముకోలేక దున్నుకుంటున్న పరిస్థితి. అకాల వర్షాలతో పూర్తిగా పంట నష్టపోయారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వెయ్యాలి. యుద్ద ప్రాతిపదికన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి. ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు రూ.5 వేల తక్షణ ఆర్థిక సహాయం, రైతులకు పంట నష్ట పరిహారం తక్షణమే అందించాలి’’ అని అనురాధ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-04-10T19:31:19+05:30 IST