సీఎం జగన్పై పంచుమర్తి అనురాధ ఫైర్
ABN , First Publish Date - 2021-11-16T00:55:00+05:30 IST
బాబాయ్ని గొడ్డలి పోటుతో, ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓటుతో జగన్ రెడ్డి ఖూనీ చేశారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. గెలుపు కోసం వైసీపీ గూండాలు రాష్ట్రమంతా అరాచకాలు సృష్టించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: బాబాయ్ని గొడ్డలి పోటుతో, ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓటుతో జగన్ రెడ్డి ఖూనీ చేశారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. గెలుపు కోసం వైసీపీ గూండాలు రాష్ట్రమంతా అరాచకాలు సృష్టించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గూండాల అరాచకాలపై కుప్పం మహిళలు వీరోచితంగా పోరాడారని పేర్కొన్నారు. అధికారులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తపాలా డ్యూటీ మాత్రమే చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ విధి విధానాలు ఏంటో నీలం సాహ్నికి తెలుసా? అని ప్రశ్నించారు. వైసీపీ అరాచక పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని వ్యాఖ్యానించారు.