ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-04-13T18:52:40+05:30 IST

యాదాద్రి శ్రీల‌క్ష్మిన‌ర్సింహా స్వామి దేవాస్థాన శ్రీ ప్లవ నామ ఉగాది పంచాంగాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు.

ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైదరాబాద్: యాదాద్రి శ్రీల‌క్ష్మిన‌రసింహ స్వామి దేవాస్థానం శ్రీ ప్లవ నామ ఉగాది పంచాంగాన్ని ప్రభుత్వ సలహాదారు రమణాచారితో కలిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బొగ్గుల‌కుంట‌లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే  పంచాంగ ప‌ఠ‌నం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు వేణుగోపాల చారి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, రీజినల్ జాయింట్ కమిషనర్ క్రిష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T18:52:40+05:30 IST