టీమ్ ఇండియాకి నిద్ర మాత్రలు ఇవ్వాలి : షోయబ్ అఖ్తర్
ABN , First Publish Date - 2021-10-25T00:34:39+05:30 IST
టీ20 వరల్డ్ కప్లో భారత్పై పాకిస్థాన్ విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఇదే ప్రశ్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ని అడగ్గా ఆయన జోక్ చేస్తూ...
టీ20 వరల్డ్ కప్లో భారత్పై పాకిస్థాన్ విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఇదే ప్రశ్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ని అడగ్గా ఆయన జోక్ చేస్తూ... స్లిపింగ్ పిల్స్ ఇవ్వండి అన్నాడు! భారత క్రికెటర్లకు నిద్ర మాత్రలు ఇస్తే తప్ప పాక్ గెలిచే ఛాన్స్ లేదంటూ ఆయన ఛమత్కరించాడు. అలాగే, మరో రెండు చిట్కాలు కూడా షోయబ్ చెప్పుకొచ్చాడు. పాక్ గెలవాలంటే ముందు విరాట్ కోహ్లీని రెండు రోజుల పాటూ ఇన్స్టాగ్రామ్ వాడనీయవద్దని సరదాగా సలహా ఇచ్చాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ధోనిని స్వయంగా బ్యాటింగ్కు దిగవద్దని అభ్యర్థించమన్నాడు. షోయబ్ అఖ్తర్ ఇప్పటికీ తాను ధోనీని మంచి ఫామ్లో ఉన్న డేంజరస్ బ్యాటర్గానే ఫీలవుతున్నానని చెప్పాడు. వరల్డ్ కప్ మ్యాచెస్లో ఇంత వరకూ ఇండియాపై పాకిస్థాన్ ఒక్కసారి విజయం సాధించలేకపోయింది...