సర్ఫరాజ్‌తో బూట్లు మోయిస్తారా.. పీసీబీపై అక్తర్ ఫైర్

ABN , First Publish Date - 2020-08-08T00:27:00+05:30 IST

మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పాకీస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘సర్ఫరాజ్‌ విషయంలో ఇంత దారుణంగా...

సర్ఫరాజ్‌తో బూట్లు మోయిస్తారా.. పీసీబీపై అక్తర్ ఫైర్

ఇస్లామాబాద్: మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పాకీస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘సర్ఫరాజ్‌ విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా..!’ అంటూ ఫైర్ అయ్యాడు. బుధవారం నుంచి ఇంగ్లాండ్-పాకీస్తాన్‌ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌ రెండో రోజు ఆటలో భాగంగా మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ షూస్, డ్రింక్స్ తీసుకుని మైదానంలోకి వచ్చాడు. క్రీజులో ఉన్న షాదాబ్‌కు అవి అందించి వెళ్లిపోయాడు. దీనిపై అక్తర్ టీం మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘సర్ఫరాజ్‌ 4 సంవత్సరాలు పాటు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నీలలో విజయం అందించాడు. అతడి‌తో షూ మోయిండం సరైన పద్ధతి కాదు. ఒకవేళ అతడే స్వయంగా ఆ పని చేయడానికి ముందుకొచ్చినా మేనేజ్‌మెంట్ వారించాలి. నేను క్రికెట్ ఆడుతున్న సమయంలో వసీం అక్రమ్ ఎప్పుడూ నాకోసం షూస్ తీసుకురాలేదు. అలాంటప్పుడు సర్ఫరాజ్‌ ఎందుకు తీసుకొచ్చాడం’టూ ఫైర్ అయ్యాడు.

Updated Date - 2020-08-08T00:27:00+05:30 IST