కివీస్‌ పర్యటనకు పాక్‌ ఓకే

ABN , First Publish Date - 2020-08-14T08:59:57+05:30 IST

కరోనా ఉధృతి కొనసాగుతున్నా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కొక్క టోర్నీ పట్టాలెక్కుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీ్‌సలో పాల్గొంటున్న పాకిస్థాన్‌ జట్టు.. వచ్చే డిసెంబరులో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది...

కివీస్‌ పర్యటనకు పాక్‌ ఓకే

కరాచీ: కరోనా ఉధృతి కొనసాగుతున్నా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కొక్క టోర్నీ పట్టాలెక్కుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీ్‌సలో పాల్గొంటున్న పాకిస్థాన్‌ జట్టు.. వచ్చే డిసెంబరులో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు కివీ్‌సతో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీ్‌సకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) గురువారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే పూర్తి షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదు. ఇక వచ్చే వేసవిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ జట్లతో కూడా స్వదేశంలో కివీస్‌ సిరీ్‌సలు ఆడనుంది. కాగా, అక్టోబరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నట్టు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) గురువారం ప్రకటించింది. 

Updated Date - 2020-08-14T08:59:57+05:30 IST