కోహ్లీ సేన ఓటమితో టాప్ప్లేస్లోకి పాక్!
ABN , First Publish Date - 2021-08-29T02:39:07+05:30 IST
ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు దారుణ పరాజయం తర్వాత ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)
లీడ్స్: ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు దారుణ పరాజయం తర్వాత ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టకలో మార్పులు చోటుచేసుకున్నాయి. 2021-23 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో రూట్ సేనకు ఇది తొలి టెస్టు విజయం. డబ్ల్యూటీసీలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఇంగ్లండ్కు విజయం అందని ద్రాక్షగా మారగా, తాజా విజయంతో వెస్టిండీస్, ఇండియా, పాకిస్థాన్ సరసన చేరింది. ఇక, తాజా ఓటమితో భారత జట్టు అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోగా పాకిస్థాన్ టాప్ ప్లేస్కు చేరుకుంది. వెస్టిండీస్ ఆ తర్వాతి స్థానంలో నిలవగా, ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పరిమితమైంది.
ఇండియా, ఇంగ్లండ్ జట్లు రెండూ తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా రెండేసి పాయింట్లు చొప్పున కోల్పోయాయి. అయితే, ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో లభించిన నాలుగు పాయింట్ల నుంచి ఈ రెండేసి పాయింట్లను మినహాయించారు. దీంతో ఇరు జట్ల పాయింట్లు సమానం కాగా, లార్డ్స్ విజయంతో భారత జట్టు పాయింట్లు పెరిగాయి. తాజాగా లీడ్స్ టెస్టులో ఇంగ్లిష్ జట్టు విజయం సాధించడంతో ఇరు జట్ల పాయింట్లు మళ్లీ సమమయ్యాయి.