ప్రస్తుత పరిస్థితిలో ఆక్సిజన్ అవసరం చాలా ఉంది: ఆళ్ల నాని
ABN , First Publish Date - 2021-05-14T18:15:08+05:30 IST
విశాఖ: విశాఖ మహానగరంలో ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం జరగనుందని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు.
విశాఖ: విశాఖ మహానగరంలో ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం జరగనుందని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. నేడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితిలో ఆక్సిజన్ అవసరం చాలా ఉందన్నారు. ఆక్సిజన్ సరఫరాకి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయన్నారు. ఆక్సిజన్ సరఫరా 200 మెట్రిక్ టన్నుల నుంచి 600 మెట్రిక్ టన్నులకు పెంచినప్పటికీ సరిపోవడం లేదన్నారు. ఇటువంటి జాగ్రత్తలే అన్ని హాస్పిటల్స్లో తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు.