సూర్యాపేట: కూలీలను పట్టించుకోని యాజమాన్యం

ABN , First Publish Date - 2020-03-30T20:02:31+05:30 IST

జిల్లాలోని కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న..

సూర్యాపేట: కూలీలను పట్టించుకోని యాజమాన్యం

సూర్యాపేట: జిల్లాలోని కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్ కూలీలను యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో కూలీలు వీడియో ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో గ్రామ సర్పంచ్ కాసాని శ్రీనివాసరావు కూలీలకు వసతి ఏర్పాటు చేశారు. 90 మంది కూలీలకు రూ. 30 వేల సరుకులు అందజేశారు. లాక్‌డౌన్ గడువు ముగిసే వరకు కూలీలకు వసతి ఏర్పాటు చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తహశీల్దార్ మహమ్ముద్ అలీ ఆదేశించారు.

Updated Date - 2020-03-30T20:02:31+05:30 IST